చిత్తూరు జిల్లాలోని సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను టీడీపీ కార్యకర్త తాళ్లతో చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఈ దారుణం జరిగింది. నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష, ఆమెభర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన...
ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుందన్నారు. ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం...
ఇటీవల గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులకు ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. 1:2 నిష్పత్తిలో సుమారు 182 మందిని రెండు బోర్డుల ద్వారా ఇంటర్వ్యూ చేయనున్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే రోజునే ఏపీపీఎస్సీ కార్యాలయంలో...
తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. దీంతో బడుల వద్ద పిల్లలతో సందడి నెలకొంది. మార్కెట్లలో విద్యార్థులకు సంబంధించి పుస్తకాలు, బ్యాగులు, ఇతరత్రా విద్యా సామగ్రి కొనుగోళ్లతో సందడి నెలకొంది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు పుస్తకాల ధరలు భారీగా పెంచేశారు. అలాగే ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు...
తనపై తన కూతురు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.ఈ లేఖలో తన కూతురు క్రాంతి చేసిన ట్వీట్పై ఆయన స్పందించారు. తన చిన్న కొడుకు గిరి రాజకీయ ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోతున్నారని మండిపడ్డారు. తన...
ఏపీలో బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయనగరం పట్టణానికి చెందిన బాలిక భీమిలిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ పదో తరగతి వరకు చదువుకుంది. ఈ క్రమంలో బాలికకు హేమలత అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె...
ఏపీలో కూటమి ప్రభుత్వం గెలిచి సంవత్సరం పూర్తయ్యిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రజా స్వామ్యం గెలిచిన రోజు అని ఆయన పేర్కొన్నారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారన్నారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయని...