భారత్, పాక్ మధ్య జరుగుతున్న ఆకస్మిక పరిణామాలతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ను వారం రోజుల పాటు వాయిదా వేసింది. ప్లేయర్ల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ , పాకిస్తాన్ సరిహద్దుల్లో కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు వారి సిబ్బంది ప్రయాణించాల్సి ఉన్న నేపథ్యంలో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ ఐపీఎల్ 2025 సీజన్ను నిరవధికంగా వాయిదా వేసింది. ఇప్పటి వరకు ఈ ఐపీఎల్ సీజన్లో 58 ఆటల నిర్వహించారు.