Friday, April 17, 2026

అజిత్ పవార్‌కు క‌న్నీటి వీడ్కోలు

Must Read

మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం బారామతిలో ఘనంగా నిర్వహించబడ్డాయి. బారామతి విద్యా ప్రతిష్టాన్ గ్రౌండ్‌లో ప్రభుత్వం ప్రత్యేక లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఇతర రాష్ట్ర మంత్రులు, వివిధ పార్టీల ప్రముఖ నేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్షలాది అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ అభిమాన నాయకుడిని స్మరించుకుంటూ అనేక మంది కన్నీటితో ప‌ర్యంత‌మ‌య్యారు. అంత్యక్రియలను ఎంపీ సుప్రియా సూలే ద‌గ్గ‌ర నుంచి పర్యవేక్షించారు. అతిథులను ఆహ్వానించడం, కార్యక్రమం సజావుగా సాగడానికి కృషి చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -