ఏపీలో బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయనగరం పట్టణానికి చెందిన బాలిక భీమిలిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ పదో తరగతి వరకు చదువుకుంది. ఈ క్రమంలో బాలికకు హేమలత అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె చేపల తిమ్మాపురంలో రాడ్ బెండింగ్ పనులు చేస్తున్న నూకరాజుకు బాలికను పరిచయం చేసింది. నూకరాజు ఉపాధి చూపిస్తానని నమ్మబలికి బాలికను ఇంటికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరున జరిగిన ఈ ఘటనపై శనివారం భీమిలి పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు తరలించి నూకరాజు, అతడికి సహకరించిన హైమావతిపై పోక్సో నమోదు చేశారు.