Thursday, April 16, 2026

ఏపీలో బాలిక‌పై అత్యాచారం

Must Read

ఏపీలో బాలికపై ఓ యువ‌కుడు అత్యాచారం చేసిన ఘ‌ట‌న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. విజయనగరం పట్టణానికి చెందిన బాలిక భీమిలిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ పదో తరగతి వరకు చదువుకుంది. ఈ క్రమంలో బాలికకు హేమలత అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె చేపల తిమ్మాపురంలో రాడ్ బెండింగ్ పనులు చేస్తున్న నూకరాజుకు బాలిక‌ను పరిచయం చేసింది. నూక‌రాజు ఉపాధి చూపిస్తానని నమ్మబలికి బాలిక‌ను ఇంటికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరున జరిగిన ఈ ఘటనపై శనివారం భీమిలి పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు తరలించి నూకరాజు, అతడికి సహకరించిన హైమావతిపై పోక్సో నమోదు చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -