Saturday, May 17, 2025

Today Bharat

స‌రిహ‌ద్దుల్లో మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న తెలుగు జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ అమ‌రుడైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం పొందాడు. పాక్‌ దాడులను భారత్‌ సమర్థవంతంగా తిప్పికొడుతున్నా ప్రాణనష్టం జ‌ర‌గ‌డం క‌ల‌వ‌ర‌పెడుతున్న‌ది. సాధారణ ప్రజల‌తో పాటు జవాన్లు వీరమరణం పొందుతున్నారు.జమ్మూలో పాక్ జరిపిన...

నేడు మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్న 72వ ప్రపంచ సుందరి పోటీలు నేడు ప్రారంభం కానున్నాయి. దీని కోసం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఓపెనింగ్ సెర్మెనీకి సీఎం రేవంత్ రెడ్డి హాజ‌రు కానున్నారు. ఈ కార్య‌క్రమంలో వెయ్యి మందికి పైగా అతిథులు, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలు పాల్గొన‌నున్నారు. పోటీల్లో 120 దేశాల...

క‌లెక్ట‌ర్‌ను త‌హ‌సీల్దార్‌గా చేసిన సుప్రీం కోర్టు

కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో ఓ క‌లెక్ట‌ర్‌కు సుప్పీం కోర్టు షాకిచ్చింది. ఏకంగా ఆయ‌న‌ను త‌హ‌సీల్దార్ స్థాయికి డిమోష‌న్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏపీలోని ఓ డిప్యూటీ కలెక్టర్‌కు ఈ అనుభ‌వం ఎదురైంది. కుటుంబం రోడ్డున పడకూడదనే జైలు శిక్ష వేయలేదని సుప్రీంకోర్టు జడ్జి బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ కలెక్టర్‌గా...

ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల సెల‌వులు ర‌ద్దు

పాక్‌, భార‌త్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో కేంద్రం అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు, సిబ్బంది, ఉద్యోగుల‌కు సెల‌వులు ర‌ద్దు చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణ‌యం తీసుకుంది. ఆరోగ్య కార‌ణాలు మిన‌హా ఏ ఒక్క‌రికి సెల‌వులు మంజూరు చేయ‌కూడద‌ని ఉన్న‌తాధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇప్ప‌టికే సెల‌వుల్లో ఉన్న‌వారి సెల‌వుల‌ను...

జ‌వాన్ ముర‌ళీకి వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

భార‌త సైన్యంపై పాకిస్థాన్ జ‌రిపిన కాల్ప‌ల్లో వీర మ‌ర‌ణం పొందిన జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్‌కు వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ నివాళి అర్పించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ఆయ‌న ఓ పోస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని ఇండియా-పాకిస్తాన్ యుద్ధభూమిలో సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన మన తెలుగు వీర జవాన్ మురళీ నాయక్...

క‌శ్మీర్‌లో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భార‌త్, పాకిస్తాన్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల్లో క‌శ్మీర్‌లో పాక్ కాల్పుల్లో తెలుగు జ‌వాన్ వీర‌మ‌ర‌ణం పొందారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన జ‌వాన్ ముర‌ళీనాయ‌క్ తుది శ్వాస విడిచిన‌ట్లు కుటుంబ‌స‌భ్యుల‌కు స‌మాచారం వ‌చ్చింది. 2022లో అగ్నివీర్‌ జవానుగా సైన్యంలో చేరిన మురళీనాయక్‌.. రెండు రోజుల క్రితం వరకు నాసిక్‌లో విధులు...

ఐపీఎల్ వాయిదా

భార‌త్‌, పాక్ మ‌ధ్య జ‌రుగుతున్న ఆక‌స్మిక‌ ప‌రిణామాలతో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఐపీఎల్‌ను వారం రోజుల పాటు వాయిదా వేసింది. ప్లేయ‌ర్ల భ‌ద్ర‌త‌కు ప్రాధాన్య‌త‌నిస్తూ బీసీసీఐ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. భారత్ , పాకిస్తాన్ సరిహద్దుల్లో కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు వారి...

ఆప‌రేష‌న్ సింధూర్‌పై బాలీవుడ్ స్టార్స్ మౌనం

పహల్గామ్‌లో ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భార‌త సైన్యం ఆప‌రేష‌న్ సింధూర్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆప‌రేష‌న్‌లో పాక్‌లోని 9 ఉగ్ర స్థావ‌రాల‌ను ధ్వంసం చేశారు. ఈ క్ర‌మంలో దాదాపు వంద‌మంది ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టారు. ఆప‌రేష‌న్ సిందూర్‌పై, భార‌త‌ సైనికులపై దేవ వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌తో పాటు సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు కురిపించారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా...

నూతన పోప్‌గా రాబర్ట్ ప్రీవోస్ట్

ఇటీవ‌ల‌ పోప్ ఫ్రాన్సిస్ చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం త‌దుప‌రి పోప్ ఎవ‌రు అవుతార‌న్న దానిపై కొద్దిరోజులుగా తీవ్ర చ‌ర్చ న‌డిచింది. కాగా, తీవ్ర ఉత్కంఠ న‌డుమ తొలిసారి అమెరికన్ పోప్‌గా రాబర్ట్ ఫ్రాన్సిస్‌ ప్రీవోస్ట్ ఎన్నిక‌య్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 140 కోట్ల మంది క్యాథలిక్‌ల కొత్త మత గురువుగా ఆయ‌న‌ను...

పాకిస్తాన్ స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో హైఅల‌ర్ట్

భార‌త్, పాకిస్తాన్ మ‌ధ్య ప‌రిస్థితులు తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో పాకిస్తాన్‌తో సరిహద్దులో ఉన్న రాష్ట్రాల్లో కేంద్రం హైఅలర్ట్ ప్ర‌క‌టించింది. జమ్ముకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లో హై అల‌ర్ట్ కొన‌సాగుతోంది. ఢిల్లీ, హర్యానా బెంగాల్‌లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసులు పాలనాధికారులను సెలవుల‌ను రద్దు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూసివేశారు. గుజరాత్‌ సముద్ర తీరం...

About Me

665 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

స‌రిహ‌ద్దుల్లో మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న తెలుగు జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ అమ‌రుడైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు...
- Advertisement -spot_img