Thursday, January 15, 2026

#telangana

హెచ్‌సీయూ ఇష్యూపై సుప్రీం సీరియ‌స్‌

కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హెచ్‌సీయూలో చెట్ల నరికివేతపై సీఎం రేవంత్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేసింది. చెట్లు కొట్టే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాల‌ని పేర్కొంది. చెట్లను నరికినందుకు జింకలు బయటకు వచ్చి కుక్కల దాడి చేయ‌డం ఆందోళ‌న క‌లిగించింద‌న్నారు....

జ‌పాన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆ దేశానికి చేరుకున్నారు.ఈ రోజు ఉద‌యం నారిటా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం బృందం ఏప్రిల్ 22 వరకు జపాన్‌లో పర్యటించ‌నున్నారు. టోక్యో, మౌంట్‌ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో ప‌లు స‌మావేశాల్లో పాల్గొన‌నున్నారు. ఒసాకా వరల్డ్‌ ఎక్స్‌పో 2025లో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించ‌నున్నారు. మంత్రి...

నేటి నుంచి తెలంగాణ‌లో భూభార‌తి అమ‌లు

తెలంగాణ‌లో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణికి కాంగ్రెస్ ప్రభుత్వం ముగింపు ప‌లికింది. ధరణి స్థానంలో నేటి నుంచి భూ భారతిని అందుబాటులోకి రానున్నది. భూ భారతి చట్టం, పోర్టల్ ను ఈ రోజు నుంచి అధికారికంగా అమల్లోకి తీసుకురానున్నారు. సీఎం చేతుల మీదుగా లాంచింగ్ అయ్యే ఈ పోర్టల్ ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని...

రాజీవ్ యువ వికాసానికి నేడు చివ‌రి తేదీ

తెలంగాణ ప్ర‌భుత్వం యువ‌త‌కు ఉపాధి క‌ల్పించేందుకు రుణాల కోసం ఏర్పాటు చేసిన రాజీవ్‌ యువ వికాసం గడువు నేటితో ముగియ‌నుంది. గ‌తంలో మార్చి 27 వ‌ర‌కు గ‌డువు ఉండ‌గా ఏప్రిల్ 14కు పొడిగించారు. కాగా నేటితో గ‌డువు ముగియ‌నుండ‌టంతో ద‌ర‌ఖాస్తు దారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. రెండు రోజుల నుంచి స‌ర్వ‌ర్ బిజీ అంటూ...

తెలంగాణ‌లో నేటి నుంచి వర్గీకరణ అమలు

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సోమవారం నుంచి అమలు కానుంది. దాదాపు 30 ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా దీన్ని అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులు, నిబంధనలు జారీ కానున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....

హెచ్‌సీయూ భూముల్లో కాంగ్రెస్ స్కామ్ – కేటీఆర్

హెచ్‌సీయూ భూముల్లో కాంగ్రెస్ స‌ర్కార్ వేల కోట్ల స్కామ్‌కు తెర‌తీసింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హెచ్సీయూలో అడవికి ఉండే 0.4 క్యానపి లక్షణాలు ఉంటే అది ఎవరి భూమి అయినా అటవీ భూమి అవుద్దని 1996లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింద‌ని వెల్ల‌డించారు. కంచె గచ్చిబౌలి భూముల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం...

అకాల వ‌ర్షం భారీగా పంట‌న‌ష్టం

తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో గురువారం కురిసిన అకాల వ‌ర్షానికి భారీగా పంట‌న‌ష్టం జ‌రిగింది. వ‌రికోత‌ల స‌మ‌యంలో వ‌ర్షాలు ప‌డ‌టంతో తీవ్రంగా న‌ష్ట‌పోయామ‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రో వైపు ఈదురు గాలుల‌కు మొక్క‌జొన్న పంట నేల‌మ‌ట్ట‌మైంది. పంట చేతికి అంది వచ్చే క్రమంలో ఇలా జ‌ర‌గ‌డంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం...

హ‌నుమాన్ పూజ‌లో కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో హనుమాన్ మాలధారులతో కలిసి భజనలు చేసి, సహపంక్తి బిక్షలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి హ‌నుమాన్ భ‌క్తులు, ప్ర‌జ‌లు , కేటీఆర్ అభిమానులు భారీ ఎత్తున హాజ‌ర‌య్యారు. హనుమాన్‌మాలధారులు కేటీఆర్‌కు సీతారాముల చిత్రపటాన్ని అందించారు. అర్చ‌కులు ప్ర‌త్యేక పూజ‌లు...

ఢిల్లీ పార్టీని న‌మ్మితే తెలంగాణ బ‌తుకు సున్నా

ఢిల్లీ పార్టీని న‌మ్మితే తెలంగాణ బ‌తుకు సున్నా అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై , రాష్ట్ర ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. సన్నాసి ఢిల్లీ పార్టీలను నమ్మితే తెలంగాణ బతుకు సున్నా అని మరోసారి రుజువుచేసిన సందర్భమిద‌ని పేర్కొన్నారు. తెలివి లేని...
- Advertisement -spot_img

Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -spot_img