తెలంగాణ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించేందుకు రుణాల కోసం ఏర్పాటు చేసిన రాజీవ్ యువ వికాసం గడువు నేటితో ముగియనుంది. గతంలో మార్చి 27 వరకు గడువు ఉండగా ఏప్రిల్ 14కు పొడిగించారు. కాగా నేటితో గడువు ముగియనుండటంతో దరఖాస్తు దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల నుంచి సర్వర్ బిజీ అంటూ దరఖాస్తులకు ఆటంకం ఏర్పడిందని గడువు పొడిగించాలని కోరుతున్నారు. మరో పది రోజుల పాటు పెంచాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు