Sunday, December 7, 2025

జూన్ 1 నుంచి థియేట‌ర్లు బంద్‌

Must Read

తెలుగు రాష్ట్రాల్లో సినిమాల ప్ర‌ద‌ర్శ‌న విష‌యంలో ఎగ్జిబిట‌ర్లు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్ చేయాల‌ని నిర్ణ‌యించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో నేడు ఏపీ, తెలంగాణ‌కు చెందిన ఎగ్జిబిట‌ర్ల సమావేశం నిర్వ‌హించారు. నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు ఈ సమావేశానికి హాజ‌ర‌య్యారు. ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించిన అనంత‌రం అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు తేల్చిచెప్పారు. పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని తీర్మానించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -