తెలుగు రాష్ట్రాల్లో సినిమాల ప్రదర్శన విషయంలో ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో నేడు ఏపీ, తెలంగాణకు చెందిన ఎగ్జిబిటర్ల సమావేశం నిర్వహించారు. నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. పలు విషయాలపై చర్చించిన అనంతరం అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు తేల్చిచెప్పారు. పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని తీర్మానించారు.