వైకుంఠ ఏకాదశి పర్వదిన టోకెన్ల జారీ సమయంలో జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందగా, పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు టీటీడీ పరిహారం ప్రకటించింది. గాయపడిన బాధితులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ క్రమంలో తిరుమలలో...
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో పర్యటనలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి. దానిపై సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఒత్తిడి చేయడంతో ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టారని హిందుస్థాన్ టైమ్స్ ఓ కథనంలో తెలిపింది. అయితే, రోహిత్ తీసుకున్న ఈ నిర్ణయం కోచ్ గౌతమ్ గంభీర్ని అసంతృప్తికి గురి చేసిందనే ప్రచారం...
ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురంలో కేరళ తరహా పడవ పోటీలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా ఇక్కడి ప్రధాన పంట కాలువలో డ్రాగన్ పడవ, ఈత పోటీలు ఏర్పాటు చేశారు. వీటిని తిలకించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఎమ్మెల్యే సత్యానందరావు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు.
ఈసారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో రానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇరు దేశాల బంధం బలోపేతానికి సంబంధించి పలు చర్చల్లో భారత ప్రధాని మోదీ, సుబియాంటో పాల్గొంటారని తెలుస్తోంది. ప్రబోవో సుబియాంటో గతేడాది అక్టోబరులో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు. గతేడాది రిపబ్లిక్ డేకి ఫ్రాన్స్ అధ్యక్షుడు...
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- కియారా అద్వానీ జంటగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ ఈ నెల 10న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ‘నానా హైరానా’ పాటను టెక్నికల్ సమస్యల వల్లే తొలగించింది. తాజాగా, ఈ పాటను ఈ రోజు (ఆదివారం) నుంచి థియేటర్లలో యాడ్ చేయనున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. దీంతో...
రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 26 నుంచి ఎకరానికి రూ.12 వేలు రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నారు. భూ భారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనుంది. భూవిస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు దీన్ని అందించనున్నారు. ROFR పట్టాదారులకు కూడా సాయం అందజేయనున్నారు....
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈనెల 28 వరకు హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది. హరీశ్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ జి.చక్రధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను...
పిఠాపురంలో గోకులాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'అమ్మాయిలను ఏడిపించి మగతనం అనుకుంటే తొక్కి నార తీస్తాం. పిఠాపురంలో ఈవ్టీజింగ్ అనేది ఉండకూడదు. క్రిమినల్స్కి కులం ఉండదు.. తప్పు చేసి కులాల చాటున దాక్కుంటే ఈడ్చుకొస్తాం.. మహిళలను జోలికి వస్తే తాట తీస్తాం. సొంత నియోజకవర్గాన్ని కాపాడుకోకపోతే నాకు...
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డి.. కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమురయ్య.. కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డిని ఎంపిక చేసింది.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పూర్వంచల్ ప్రజలపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. బీజేపీ ఆధ్వర్యంలో పూర్వాంచల్ సమ్మాన్ మార్చ్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ఇంటి వద్దకు చేరుకున్న నిరసనకారులుల.. పూర్వాంచల్ వాసులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులకు, బీజేపీ...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...