Monday, March 2, 2026

#telangana

రేపు తెలంగాణకు అమిత్ షా

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. నిజామాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో ఆయ‌న‌ పాల్గొననున్నారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంత‌రం డీఎస్‌ విగ్రహ ఆవిష్కరణ చేయ‌నున్నారు. ఈ మేరకు జూన్ 29న మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట్ చేరుకోనున్నట్లు సమాచారం. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌లు భారీ ఏర్పాట్లు...

జూన్ 30 నుంచి జూడాల స‌మ్మె

తెలంగాణ‌లోని జూనియ‌ర్ డాక్ట‌ర్లు ఈనెల 30 నుండి నిరవధిక సమ్మె ప్రకటించారు. జనవరి నెల నుంచి తమకు ఇవ్వాల్సిన స్టైపెండ్ చెల్లించాలని, నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వం వెంటనే స్పందించకపోతే ఈనెల 30 నుండి నిరవధిక సమ్మె...

ఆటో కార్మికుల స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌తాం – హ‌రీష్ రావు

తెలంగాణ‌లోని ఆటో కార్మికుల స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌తామ‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు. ప‌టాన్ చెరు కు చెందిన ఆటో డ్రైవ‌ర్ల సంఘం ప్ర‌తినిధులు హ‌రీష్‌రావును క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. రాష్ట్రంలో ఆటో కార్మికుల జీవితం దయనీయంగా మారింద‌న్నారు. పాల‌కులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి త‌మ‌ను మోసం చేశారంటూ...

స‌ర్పంచి ఎన్నిక‌ల‌పై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్య‌లు చేసింది. సెప్టెంబర్‌ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రభుత్వం, ఎన్నికల సంఘం అభ్యర్థనలను పరిగణలోకి తీసుకొని ఈ తీర్పు ఇచ్చిన‌ట్లు ధర్మాసనం తెలిపింది.కాగా, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేద‌ని హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖల‌య్యాయి. గతేడాది జనవరి 31తో...

కాంగ్రెస్ హామీల‌పై క‌విత పోస్టు కార్డు ఉద్య‌మం

తెలంగాణ‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల‌కు ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత డిమాండ్ చేశారు. ఈ మేర‌కు తెలంగాణ జాగృతి ఆధ్వ‌ర్యంలో క‌విత పోస్టు కార్డు ఉద్యమానికి తెర‌లేపారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆరు హామీలు ఇవ్వడం ద్వారా తెలంగాణలో...

రేవంత్ ఢిల్లీకి తిరిగేందుకే స‌రిపోతుంది – హ‌రీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి తిరిగేందుకే స‌రిపోతుంద‌ని, ఇక కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ప‌ల్లెల‌పై ప‌ట్టింపు ఎక్క‌డ ఉంద‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు ఎద్దేవా చేశారు. గ్రామాల్లో చెత్త సేక‌రించే ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ల‌కు జీతాలు చెల్లించ‌క‌పోవ‌డంపై హ‌రీష్ రావు మండిప‌డ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తెస్తాన‌న్న మార్పు ఇదేనా అని ప్ర‌శ్నించారు. ట్రాక్టర్ లో...

కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వ‌రం – ఎంపీ ఈట‌ల‌

కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాన‌ని బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ స‌వాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్‌లో ఆమోదం పొందలేదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈట‌ల రాజేందర్ స్పందించారు. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టిన సంఘటన దేశంలో ఎక్కడైనా ఉందా...

బ‌డి గంట మోగింది!

తెలుగు రాష్ట్రాల్లో వేస‌వి సెల‌వులు ముగిశాయి. నేటి నుంచి పాఠ‌శాల‌లు పునః ప్రారంభమయ్యాయి. దీంతో బ‌డుల వ‌ద్ద పిల్ల‌ల‌తో సంద‌డి నెల‌కొంది. మార్కెట్ల‌లో విద్యార్థుల‌కు సంబంధించి పుస్త‌కాలు, బ్యాగులు, ఇత‌ర‌త్రా విద్యా సామ‌గ్రి కొనుగోళ్ల‌తో సంద‌డి నెల‌కొంది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు పుస్త‌కాల ధ‌ర‌లు భారీగా పెంచేశారు. అలాగే ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో ఫీజులు...

కాళేశ్వ‌రంపై కేసీఆర్ విచార‌ణ‌

కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ నేడు మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించ‌నుంది. ఈ మేర‌కు కేసీఆర్ బీఆర్‌కే భ‌వ‌న్‌కు చేరుకున్నారు. కేసీఆర్ విచార‌ణ నేప‌థ్యంలో బీఆర్ఎస్ ప్ర‌ధాన నాయ‌కుల‌తో పాటు కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో బీఆర్‌కే భ‌వ‌న్‌కు త‌ర‌లివ‌చ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్...

బెట్టింగ్ భూతానికి యువ‌కుడు బ‌లి

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతానికి యువ‌త బ‌ల‌వుతూనే ఉన్నారు. ప్ర‌భుత్వాలు దీనిపై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నా ఈ చావులు ఆగ‌డం లేదు. తాజాగా మ‌రో యువ‌కుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బ‌ల‌య్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయిపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ (20) ఇంటర్మీడియట్ పూర్తి చేసి కారు మెకానిక్‌గా ప‌ని చేస్తున్నాడు. మూడేళ్లుగా బెట్టింగ్‌కు...
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img