తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతానికి యువత బలవుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు దీనిపై అవగాహన కల్పిస్తున్నా ఈ చావులు ఆగడం లేదు. తాజాగా మరో యువకుడు ఆన్లైన్ బెట్టింగ్కు బలయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయిపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ (20) ఇంటర్మీడియట్ పూర్తి చేసి కారు మెకానిక్గా పని చేస్తున్నాడు. మూడేళ్లుగా బెట్టింగ్కు బానిసగా మారి స్నేహితులు, పరిచయస్తుల దగ్గర దాదాపు రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. కుటుంబ సభ్యులు ఈ విషయం తెలుసుకొని మందలించారు. అప్పులు తీర్చే మార్గం లేక, కుటుంబసభ్యుల మాటలతో మనోవేదనకు గురైన వంశీ పొలం వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.