Tuesday, July 15, 2025

కాంగ్రెస్ హామీల‌పై క‌విత పోస్టు కార్డు ఉద్య‌మం

Must Read

తెలంగాణ‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల‌కు ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత డిమాండ్ చేశారు. ఈ మేర‌కు తెలంగాణ జాగృతి ఆధ్వ‌ర్యంలో క‌విత పోస్టు కార్డు ఉద్యమానికి తెర‌లేపారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆరు హామీలు ఇవ్వడం ద్వారా తెలంగాణలో అధికారంలోకి వచ్చింద‌న్నారు. 18 నెలల తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంత దారుణంగా విఫలమైందో చూస్తున్నామ‌న్నారు. ఈరోజు, తెలంగాణ జాగృతి సోనియా గాంధీకి వేలాది పోస్ట్‌కార్డ్‌లను పంపి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించాలని డిమాండ్ చేస్తూ పోస్ట్‌కార్డ్ ప్రచారాన్ని ప్రారంభించింద‌న్నారు. మహిళలకు రూ.2500, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు పెంచాల‌ని డిమాండ్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాళేశ్వరంపై కాంగ్రెస్ నేత‌ల‌వ‌న్నీ అబ‌ద్ధాలే – ఎమ్మెల్సీ కవిత

కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణల‌న్నీ అబద్దాలని ఆమె అన్నారు. “మేడిగడ్డ కూలిపోయింది, కొట్టుకుపోయిందనే...
- Advertisement -

More Articles Like This

- Advertisement -