కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్లో ఆమోదం పొందలేదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈటల రాజేందర్ స్పందించారు. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టిన సంఘటన దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ఇలాంటి కీలక అంశాలపై కేబినెట్ ఆమోదం లేకుండా కేసీఆర్ ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆనాడు కేసీఆర్ కేబినెట్ లో ఉన్న ముగ్గురు మంత్రులు ఇప్పుడు మీ పక్కనే ఉన్నారని, వారిని అడిగితే స్పష్టంగా చెప్తారని ఈటల పేర్కొన్నారు.