రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో పోలీసులు రాజీపడవద్దని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ స్టేడియంలో పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశ రక్షణ, సమాజ రక్షణ...
హైడ్రాకు అడ్డువస్తే తొక్కుకుంటూ పోతామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. శనివారం హైదరాబాద్ చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గాంధీ కుటుంబానికి,...
ఏపీలోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని అనుమతులు లేకుండా ఆక్వా చెరువులు నడుపుతున్న యజమానులు.. ప్రతి నెలా మామూళ్లు చెల్లించాలని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. అధికారుల సమక్షంలోనే ఈ హెచ్చరిక చేయడంతో అందరూ కంగుతున్నారు. దీనిపై ప్రతిపక్ష వైసీపీ నేతలు...
రాష్ట్ర విభజన సమయంలో అనేక ఇబ్బందులు పడ్డామని, అమరావతి రైతులను ఒప్పించి భూసేకరణ చేపట్టామన్నారు. హైదరాబాద్ లో సైబరాబాద్ నిర్మించిన ఘనత తనదేనన్నారు. ముందుచూపుతోనే సైబరాబాద్ లో ఎనిమిది వరుసల రోడ్లు వేశామన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఐదు వేల ఎకరాలు ఎందుకంటూ ఆనాడు అందరూ ప్రశ్నించారని.. అభివృద్ధికి అడ్డుపడేవారు ప్రతీచోటా ఉంటారని పేర్కొన్నారు. అమరావతి...
తెలంగాణలో జీవో 29ను తక్షణమే ఉపసంహరించుకోవాలని గ్రూప్–1 అభ్యర్థులు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో 29ను రద్దు చేసి.. జీవో 55 అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 29 కారణంగా అణగారిన వర్గాల వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ధర్నాకు బీజేపీ ఎంపీ...
ఇంటర్నెట్ బంద్.. భారీగా పోలీసులు
ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై బజరంగ్ దళ్ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతకు దారి తీసింది. వేలాది మంది హిందువులు ఆలయం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వీరికి సంఘీభావం తెలిపారు. హిందువుల ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. ఈక్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు....
రైతు భరోసా(రైతు బంధు) పథకంపై కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పథకంపై సబ్ కమిటీ వేశామని, తుది నివేదిక వచ్చిన తర్వాతే రైతు భరోసా ఇస్తామన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ లో రైతు భరోసా ఇవ్వలేమని పరోక్షంగా పేర్కొన్నారు. రాబోయే పంటకాలం నుంచి ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. కాగా, ఎకరాకు రూ.15వేల...
ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు విచక్షణ కోల్పోయి దాష్టీకాలకు పాల్పడుతున్నారు. నాగర్ కర్నాల్ జిల్లాలో ఓ ఎస్సై తన ముందు తల దువ్వుకున్న యువకులకు శిరోముండనం చేయించాడు. వివరాల్లోకి వెళితే... నాగర్ కర్నూల్ జిల్లా లింగాలలోని ఓ పెట్రోల్ బంక్ లో ముగ్గురు యువకులు.. బంక్ సిబ్బందితో గొడవపడ్డారు. దీంతో ఎస్సై జగన్ రంగప్రవేశం...
సిటీలో పబ్బులు వ్యభిచార, అశ్లీల నృత్యాలకు అడ్డాగా మారాయి. బంజారాహిల్స్ లోని ఓ క్లబ్ లో అశ్లీల నృత్యాల వ్యవహారం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ లోని ఓ పబ్బు యాజమాన్యం ఉద్యోగాల పేరుతో యువతులకు ఎర వేస్తోంది. పబ్బులో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, వారితో నృత్యాలు చేయిస్తోంది. అర్ధరాత్రి సమయంలో న్యూడ్ డాన్సులు...
ఇటీవల మహిళలతో న్యూడ్ కాల్స్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. కానీ, విచిత్రంగా ఓ మహిళ ఎమ్మెల్యేకు బలవంతంగా న్యూడ్ కాల్ చేయడం కలకలం రేపింది. హనీ ట్రాప్ లోకి దింపాలని భావించిందో లేక వీడియో రికార్డ్ చేసి డబ్బులు డిమాండ్ చేసిందో తెలియదు కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది....