దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 179 కి చేరింది. సియోల్ నుంచి ముయూన్ కు చేరుకుంటున్న విమానం.. రన్ వే నుంచి దూసుకెళ్లి సేఫ్టీ వాల్ ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ల్యాండింగ్ గేర్ లో వైఫల్యం వల్లే ఇలా జరిగింది. ఈ ఘటనలో 179 మంది మృతి చెందారు. ఇందులో 85 మంది మహిళలు ఉన్నారు. థాయ్ లాండ్ నుంచి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది దక్షిణ కొరియాలోని సియోల్ కు 290 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముయాన్ కు విమానం బయలుదేరింది. ఉదయం 9.03 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.