పహల్గాం ఉగ్ర దాడిపై రగిలిపోయిన భారత్ మంగళవారం అర్ధరాత్రి ప్రతీకార చర్యలు ప్రారంభించింది. పాక్ సైన్యంపై ఎయిర్ స్ట్రైక్స్ తో విరుచుకుపడింది. తొమ్మిది ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతంగా చేపట్టినట్లు భారత సైన్యం వెల్లడించింది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. మతం...
హైదరాబాద్ నగరవాసులకు మెట్రో యాజమాన్యం షాక్ ఇవ్వనుంది. మెట్రో ఛార్జీలను పెంచనున్నట్లు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు మే రెండో వారంలో పెంచిన ఛార్జీలు అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఎల్ అండ్ టీ గ్రూప్ ఛైర్మన్ భారత్కు వచ్చిన తర్వాత ఛార్జీల పెంపుపై తుది నిర్ణయం...
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీని కోసం వరంగల్ శివారులోని ఎల్కతుర్తిలో భారీ ఏర్పాట్లు చేశారు. 1,200 ఎకరాల్లో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. సుమారు 10 లక్షల మంది వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయన సభలో...
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఆయన సంగీతం అందించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోని ఓ పాటపై కాపీ రైట్ కేసులో కీలక తీర్పునిచ్చింది. పిటిషన్దారుడికి రూ.2 కోట్లు చెల్లించాలని ఏఆర్ రెహమాన్తో పాటు చిత్ర నిర్మాణ సంస్థను ఆదేశించింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2023లో విడుదలై...
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఓ మతానికి చెందిన వారిపై వస్తున్న ఆరోపణలపై బీజేపీ మిత్రపక్షం శివసేన పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే స్పందించారు. ఈ దాడిలో జాతి, మతం గురించి మాట్లాడకూడదని వ్యాఖ్యానించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన సయ్యద్ హుస్సేన్ షా కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం, ఇల్లు...
పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడ్డ వారిని పట్టుకునేందుకు భద్రతా దళాలు చర్యలు ముమ్మరం చేశాయి. నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ దుశ్చర్యకు పాల్పడ్డ వారి ఇండ్లను ధ్వంసం చేశాయి. జమ్మూకశ్మీర్లో సుమారు ఐదుగురు ఉగ్రవాదుల ఇండ్లను బాంబులతో పేల్చాయి. షోపియాన్లోని చోటిపొరా గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని, కుల్గాంలోని...
పహల్గామ్ ఉగ్రదాడి భారత దేశాన్ని కుదిపేస్తోంది. పాకిస్తాన్ దుశ్చర్యపై భారతీయులు రగిలిపోతున్నారు. ఈ దాడికి పాల్పడినందుకు వారికి బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. భారతీయుల ఆగ్రహ జ్వాలలు ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమాకు అంటుకుంటున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ఇమాన్వీ ఓ పాకిస్తానీ అని, అక్కడి మిలిటెంట్ కూతురని’ ప్రచారం జరిగింది. దీంతో వెంటనే...
ఆంధ్రప్రదేశ్ను అప్పుల పాలు చేసి నీతులు చెబుతున్నారా? అంటూ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. సంపద సృష్టిస్తామని ఊదరగొట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా అప్పులు చేసి, ప్రజలకు ఒక్క పథకం కూడా అందించడం లేదని విమర్శించారు. హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో బుగ్గన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం కంటే...
పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయనుంది. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన జేడీ చంద్రమౌళి, నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఐటి ఉద్యోగి మధుసూదన్ అనే ఇద్దరు వ్యక్తులు పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందారు. సీఎం చంద్రబాబు వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. మరోవైపు మధుసూదన్...
పహల్గామ్ మారణహోమంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావు వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పర్యాటకులకు సాయం అందిస్తామన్నారు. ఈ ఘటనపై తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు,...
బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...