నేడు స్వాతంత్య్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా వైయస్ జగణ్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు నివాళి అర్పించారు. స్వాతంత్య్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని, తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శత్రుచర్ల పరీక్షిత్ రాజు, అలజంగి జోగారావు, తిప్పల నాగిరెడ్డి, మళ్ళ విజయ్ ప్రసాద్, వాసుపల్లి గణేష్, తదితరులు పాల్గొన్నారు.