Tuesday, April 28, 2026

అలుగు వ‌ర్షిణిపై ఎస్సీ కమిషన్ సీరియస్

Must Read

ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణిపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయ్యింది. ఇటీవ‌ల గురుకుల విద్యార్థుల విష‌యంలో ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై క‌మిష‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు బోర్డు తుడవడం, గ‌దులు శుభ్రం చేసుకోశ‌డం, టాయిలెట్ కడగడంలో తప్పేం ఉందంటూ అలుగు వ‌ర్షిణి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ఆడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. దీనిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అయ్యాయి. దీంతో ఎస్సీ గురుకుల విద్యార్థుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే వివరణ ఇవ్వాలని ఎస్సీ గురుకులాల ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీకి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -