ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న 72వ ప్రపంచ సుందరి పోటీలు నేడు ప్రారంభం కానున్నాయి. దీని కోసం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓపెనింగ్ సెర్మెనీకి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా అతిథులు, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలు పాల్గొననున్నారు. పోటీల్లో 120 దేశాల నుంచి కంటెస్టెంట్స్ పాల్గొనననున్నారు. ఇప్పటికే 109 దేశాల నుంచి అందాల భామలు హైదరాబాద్కు వచ్చేశారు. తెలంగాణ సంస్కృతి, కళలు, సంప్రదాయాల మేళవింపుతో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ నెల 31 వరకు జరగనున్న పోటీలకు హైదరాబాద్లోని వేదికలను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకలు 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.పాక్ దాడుల నేపథ్యంలో స్టేడియం, కంటెస్టెంట్లు బస చేస్తున్న ట్రైడెంట్ హోటల్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.