Thursday, April 16, 2026

రేవంత్ రెడ్డికి తమ్మినేని వార్నింగ్!

Must Read

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు కాంగ్రెస్ తో స్నేహపూర్వకంగా ఉన్నామని, ఇక నుంచి రోడ్లపైకి వస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యలను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. సీపీఎం పార్టీకి గెలవకపోయినా, ఓడించడం తెలుసని చురుకలు అంటించారు. కొందరు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, పనితీరు మార్చుకోవాలన్నారు. అవసరానికి మించి కాంగ్రెస్ నేతలకు సలాం కొడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అడుగులకు మడుగులు వత్తుతున్న పోలీసులు.. డ్రెస్సులు విప్పి మూడు రంగుల కాంగ్రెస్ జెండా వేసుకొని తిరగాలని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -