Wednesday, April 15, 2026

వెలుగులోకి ‘గాడిద’ కుంభకోణం

Must Read

అమాయకులను ఆసరాగా చేసుకొని గాడిద పాల పేరుతో రూ.100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు దుండగులు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు డాంకీ ప్యాలెస్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. తమ వద్ద గాడిదలు కొంటే లీటర్ పాలను రూ.1600 చొప్పున కొనుగోలు చేస్తామని నమ్మించింది. స్టార్టప్ పేరుతో ఓ బ్రాంచ్ ని ఐఏఎస్ చేతుల మీదుగా ప్రారంభించింది. లాభాల పేరుతో యూట్యూబ్ లో ప్రచారం చేసుకుంది. సదరు సంస్థను సంప్రదించిన అమాయకుల నుంచి ట్రైనింగ్ పేరుతో రూ.50వేలు, గాడిదకు రూ.లక్ష, డిపాజిట్ పేరుతో రూ.5లక్షలు వసూలు చేసింది. ఇలా తమిళనాడు, ఏపీ, తెలంగాణలో రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. కొద్దినెలలు గాడిద పాలను కొని నమ్మించింది. ఆ తర్వాత కొనుగోలు ప్రక్రియను ఆపేశారు. దీంతో బాధితులు మోసపోయామని తెలుసుకున్నారు. పోలీసులను ఆశ్రయించినా న్యాయం దొరకడం లేదని పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -