భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యాకు బయలుదేరారు. కాజన్ నగరంలో జరిగే 16వ ‘బ్రిక్స్’ సదస్సులో పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తోనూ మోడీ భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం, మధ్య ఆసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాలో మోడీ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.