Friday, April 24, 2026

చంద్రబాబు ఇదేం లెక్క? కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్!

Must Read

ఏపీ సీఎం చంద్రబాబుపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. తిరుమల దర్శనానికి ఎమ్మెల్యేల నుంచి సిఫార్సు లేఖలు వస్తే టీటీడీ ఈవో తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. అదే ఆంధ్రా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణలోని యాదగిరి గుట్ట, భద్రాచలం వస్తే స్పెషల్ దర్శనాలు చేయిస్తున్నామని తెలిపారు. ఏపీలో మాత్రం తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. ఇది ఇలాగే కొనసాగితే.. తెలంగాణలోని దేవాలయాల్లో ఆంధ్రా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడుగుపెట్టనివ్వమన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో తిరుమల దర్శనం జరిగేటట్లు ఈవోకు ఆదేశాలు ఇవ్వాలని, లేదంటే ఆంధ్రా ప్రజాప్రతినిధులను బాయ్ కాట్ చేస్తామన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -