Monday, June 8, 2026

తెలంగాణలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్

Must Read

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 27న నోటిఫికేషన్ జారీ చేస్తారు. పోలింగ్‌కు 15 రోజుల సమయం ఉంటుంది. డిసెంబర్ 11న మొదటి దశ పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు. రెండు, మూడు దశలు నాలుగు రోజుల తేడాతో డిసెంబర్ 15, 19 తేదీల్లో జరిగే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహిస్తుంది. రాష్ట్రంలో 31 జిల్లాల్లో 545 మండలాలు, 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత ఏర్పాట్లు పూర్తి చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -