Monday, June 8, 2026

ఏపీలో కొత్త జిల్లాలకు నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల

Must Read

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించడానికి నెల రోజుల గడువు ఇస్తారు. తర్వాత మంత్రుల ఆమోదంతో తుది నివేదిక ఆన్‌లైన్‌లో ఆమోదం పొందుతుంది. మార్కాపురం, మదనపల్లి, పోలవరం కొత్త జిల్లాలుగా ఏర్పడనున్నాయి. జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి పెరుగుతుంది. ప్రకాశం జిల్లాలో అద్దంకి, కందుకూరు విలీనమవుతాయి. తూర్పు గోదావరిలో మండపేట నియోజకవర్గం, పెనుగొండ మండలం మార్పులు జరుగుతాయి. ఆదోని మండలంలో పెద్ద హరివనం కొత్త మండలంగా ఏర్పడుతుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -