Monday, April 27, 2026

రూ.4 కోట్ల ఆస్తి ప‌త్రాలు హుండీలో వేసిన వ్య‌క్తి

Must Read

కుటుంబ కలహాల కారణంగా ఓ వ్య‌క్తి రూ.4 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాల‌ను ఆల‌యంలోని హుండీలో వేసిన సంఘ‌ట‌న తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇప్పుడు త‌మ ఆస్తి ప‌త్రాల‌ను తిరిగి ఇవ్వాల‌ని ఆ వ్య‌క్తి భార్య, కుమార్తెలు ఆలయ అధికారులను వేడుకుంటున్నారు. తిరువణ్ణామలై జిల్లా పడవేడుకు గ్రామానికి చెందిన మాజీ సైనికుడు విజయన్, ఆయన భార్య కస్తూరి కొంతకాలంగా కుటుంబ కలహాలతో విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో విజ‌య‌న్ రేణుకాంబాల్ ఆలయ హుండీలో రూ.4 కోట్ల విలువైన త‌మ‌ ఆస్తి పత్రాలను వేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ స‌భ్యులు ఆలయ అధికారులను క‌లిసి ఆస్తి పత్రాలు తిరిగివ్వాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆలయ అధికారులు విజ‌య‌న్ కుటుంబ‌స‌భ్యుల‌కు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -