Friday, April 17, 2026

రూ.4 కోట్ల ఆస్తి ప‌త్రాలు హుండీలో వేసిన వ్య‌క్తి

Must Read

కుటుంబ కలహాల కారణంగా ఓ వ్య‌క్తి రూ.4 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాల‌ను ఆల‌యంలోని హుండీలో వేసిన సంఘ‌ట‌న తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇప్పుడు త‌మ ఆస్తి ప‌త్రాల‌ను తిరిగి ఇవ్వాల‌ని ఆ వ్య‌క్తి భార్య, కుమార్తెలు ఆలయ అధికారులను వేడుకుంటున్నారు. తిరువణ్ణామలై జిల్లా పడవేడుకు గ్రామానికి చెందిన మాజీ సైనికుడు విజయన్, ఆయన భార్య కస్తూరి కొంతకాలంగా కుటుంబ కలహాలతో విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో విజ‌య‌న్ రేణుకాంబాల్ ఆలయ హుండీలో రూ.4 కోట్ల విలువైన త‌మ‌ ఆస్తి పత్రాలను వేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ స‌భ్యులు ఆలయ అధికారులను క‌లిసి ఆస్తి పత్రాలు తిరిగివ్వాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆలయ అధికారులు విజ‌య‌న్ కుటుంబ‌స‌భ్యుల‌కు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -