Thursday, November 13, 2025

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం – మంత్రి నారా లోకేష్

Must Read

విశాఖపట్నంలో ఈ ఏడాది నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించనున్న సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సు – 2025కు సంబంధించి ఏర్పాట్లను సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో తొలి సమీక్ష సమావేశం ఉండవల్లిలో జరిగింది. మంత్రి నారా లోకేష్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ ఈ సమావేశంలో మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సుకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ఏర్పాట్లు, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సదస్సును “ఆంధ్రా ఈజ్ బ్యాక్” అనే నినాదంతో నిర్వహించాలని, దేశవిదేశాల నుండి పెట్టుబడులు రాగలిగేలా గ్రాండ్ ఈవెంట్‌గా మలచాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులకు సూచించింది. ఈ సందర్భంగా ఆర్థిక, పరిశ్రమలు, ఐటీ, పర్యాటక శాఖల సమన్వయంతో ముందస్తుగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచనలు ఇచ్చారు. విశాఖ సీ ఫ్రంట్, మల్టీపరపస్ ప్రాజెక్టులు, డిజిటల్ పార్క్‌లు, గ్లోబల్ కనెక్టివిటీ వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సదస్సు ద్వారా ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, విదేశీ పెట్టుబడిదారులు, పాలసీ మేకర్లు, ఎంబెసీ ప్రతినిధులు రాష్ట్రానికి ఆకర్షితులవుతారని ప్రభుత్వం భావిస్తోంది. ఉత్సాహభరితంగా రాష్ట్రాన్ని పునర్నిర్మించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు న‌మోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో కౌశిక్ రెడ్డి యూసుఫ్‌గూడ వద్ద ఫంక్షన్ హాల్‌లోకి అనుచరులతో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -