Monday, April 27, 2026

విశాఖలో జూదం ఆడుతున్న ఆరు మహిళలు అరెస్ట్‌

Must Read

విశాఖపట్నంలో గుట్టుచప్పుడు కాకుండా జూదం ఆడుతున్న ఆరుగురు మహిళలను పోలీసులు పట్టుకున్నారు. లలితానగర్‌ ప్రాంతంలో మహిళలు జూదంలో పాల్గొంటున్నారన్న సమాచారంతో నాలుగో పట్టణ పోలీసులు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.22,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో మహిళలు కూడా జూదక్రీడల్లో పాల్పడటం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -