Thursday, April 16, 2026

కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్

Must Read

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయ‌న‌పై న‌మోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఉట్నూరు పోలీసు స్టేషన్‌లో గతేడాది సెప్టెంబర్‌లో కేటీఆర్‌పై కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. ప్రభుత్వం రూ.25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్‌ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో కుంభకోణం చేశారంటూ కేటీఆర్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతల‌ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేటీఆర్ ఈ కేసును కొట్టివేయాల‌ని కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యించారు. తాజాగా ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -