హైదరాబాద్లో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 23వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. ఈ నెల 23న ఎమ్మెల్సీ ఎన్నిక జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలో బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు పోటీలో ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.