Tuesday, July 15, 2025

ప‌బ్‌లో గొడ‌వ‌.. న‌టి క‌ల్పిక‌పై కేసు న‌మోదు

Must Read

ఇటీవ‌ల ఓ ప‌బ్‌లో బ‌ర్త్ డే పార్టీ అనంత‌రం సిబ్బందితో గొడ‌వ పెట్టుకొని వార్త‌ల్లోకి ఎక్కింది న‌టి క‌ల్పిక. తాజాగా ఈమెపై గ‌చ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. మే 29న ప్రిజం పబ్ లో పార్టీ చేసుకున్న క‌ల్పిక‌ బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిన‌ట్లు యాజ‌మాన్యం ఆరోపించింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. క‌ల్పిక ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టినందుకు ప్రిజం పబ్ యాజమాన్యం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసుల సమక్షంలోనే ఈ తతంగం అంతా జ‌రిగింద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టు అనుమతితో నటి కల్పికపై పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాళేశ్వరంపై కాంగ్రెస్ నేత‌ల‌వ‌న్నీ అబ‌ద్ధాలే – ఎమ్మెల్సీ కవిత

కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణల‌న్నీ అబద్దాలని ఆమె అన్నారు. “మేడిగడ్డ కూలిపోయింది, కొట్టుకుపోయిందనే...
- Advertisement -

More Articles Like This

- Advertisement -