Saturday, May 17, 2025

బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ‌కు స‌ర్వం సిద్ధం

Must Read

బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ‌కు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. దీని కోసం వరంగల్‌ శివారులోని ఎల్కతుర్తిలో భారీ ఏర్పాట్లు చేశారు. 1,200 ఎకరాల్లో ఈ భారీ బహిరంగ సభను నిర్వ‌హించ‌నున్నారు. సుమారు 10 లక్షల మంది వస్తారని పార్టీ వ‌ర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయ‌న స‌భ‌లో సుమారు గంట పాటు ప్ర‌సంగిస్తార‌ని స‌మాచారం. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌, సిద్దిపేటలో హ‌రీష్ రావు బీఆర్ఎస్ పార్టీ జెండాల‌ను ఎగుర‌వేసి వరంగల్ సభకు బయలుదేరారు. అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయ‌కులు భారీ ఎత్తున అనుచ‌రుల‌తో క‌లిసి స‌భ‌కు బ‌య‌లు దేరారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స‌రిహ‌ద్దుల్లో మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న తెలుగు జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ అమ‌రుడైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -