- ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
వివాహేతర సంబంధంపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వివాహేతర సంబంధం నేరం కాదని ప్రకటించింది. తన భార్య ప్రియుడిపై ఓ భర్త వేసిన కేసును కొట్టి వేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 17న ఈ కేసులో ప్రియుడికి విముక్తి కలిగించింది. వివాహేతర సంబంధం నేరమంటూ ఐపీసీ 497వ సెక్షన్ ఇచ్చిన రాజ్యాంగబద్ధం బద్ధం కాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వివాహేతర సంబంధం నైతికతకు సంబంధించిన అంశమని, దాన్ని నేరంగా చూడకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడాన్ని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుత కేసులో తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, వారిద్దరూ ఓ హోటల్లో శారీరకంగా దగ్గరయ్యారని మహిళ భర్త ఆరోపించాడు. ఈ కేసులో ప్రియుడిని మేజిస్ట్రేట్ కోర్టు విడిచిపెట్టగా ఆ తీర్పును సెషన్స్ కోర్టు కొట్టివేసి, ప్రియుడికి సమన్లు పంపింది. దీన్ని ప్రియుడు ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయగా వివాహేతర సంబంధం నేరం కాదు అంటూ అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు.