హిందువులకు అత్యంత పవిత్రమైన చార్ధామ్ యాత్ర మే2న ప్రారంభం కానుంది. కేదార్నాథ్ ఆలయాన్ని మే 2న భక్తుల కోసం తెరువనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. ఇక బద్రీనాథ్ ఆలయం మే 4న ప్రారంభంకానుంది. అలాగే, మద్మహేశ్వర ఆలయం మే 21న, తుంగనాథ్ ఆలయం మే 2న తెరుస్తామని కమిటీ వివరించింది. హిమపాతం కారణంగా ఈ దేవస్థానాలు కేవలం వేసవికాలంలోనే కొద్ది రోజులు తెరిచి ఉంటాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేపడుతున్నారు. కాగా, భక్తులు లక్షలాది సంఖ్యలో తరలివస్తారని అంచనా వేస్తున్నారు.