Saturday, April 18, 2026

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Must Read

సూర్యాపేట జిల్లాలో దారునం చోటు చేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థిని కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. సూర్యాపేట – చిలుకూరు మండలం గేట్ ఇంజినీరింగ్ కాలేజ్ లో చ‌దువుతున్న కృష్ణ‌వేణి శ‌నివారం ఉద‌యం కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తల్లితోనే హాస్టల్ గదిలో కృష్ణవేణి ఉన్న‌ట్లు స‌మాచారం. కాలేజ్ యాజమాన్య వేధింపులే ఆత్మహత్యకు కారణమా? లేదా కుటుంబ కలహాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, కృష్ణ‌వేణి స్వ‌స్థ‌లం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం. విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉన్న‌ది.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -