పాక్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతుందని భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్లో 100 మంది ఉగ్రవాదులు హతం అయినట్లు ఆయన ప్రకటించారు. నేడు త్రివిధ దళాలను అఖిలపక్ష నేతలతో పాటు ఆయన అభినందించారు. పాకిస్థాన్ ఎదురుదాడికి పాల్పడితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఆపరేషన్ సింధూర్లో పాక్ పౌరులకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. తాము కేవలం ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేశామని స్పష్టం చేశారు.