Tuesday, April 28, 2026

మంత్రి సుభాశ్ కు చంద్రబాబు వార్నింగ్!

Must Read

ఏపీ సీఎం చంద్రబాబు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ పై మండిపడ్డట్లు తెలుస్తోంది. మంత్రి పనితీరు, సభ్య నమోదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనకు ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యేవి, మంత్రివి. రాజకీయాలపై అంత సీరియస్ నెస్ రాలేదు. నీ నియోజకవర్గంలో 29 శాతమే సభ్యత్వ నమోదు జరిగింది. పార్టీ నిన్ను చాలా గౌరవించింది. పార్టీకి ఉపయోగపడనప్పుడు రాజకీయాలు ఎందుకు? పనిచేయనప్పుడు మేం కూడా ప్రత్యామ్నాయం చూసుకుంటాం’ అన్నట్లు ఆడియోలో ఉంది. కాగా, ఈ ఆడియోను సుభాశ్ వ్యతిరేక వర్గీయులు విడుదల చేసినట్లు సమాచారం.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -