Sunday, December 7, 2025

కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్… నీట మునిగిన‌ పట్టణం!

Must Read

కామారెడ్డి జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా పరిస్థితి విషమంగా మారింది. కేవలం 12 గంటల్లోనే సుమారు 500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో పట్టణం మొత్తం మునిగిపోయింది. రాజంపేట, తిమ్మారెడ్డి, కల్యాణి వాగు పరిసర గ్రామాలు వరద నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. ఆగస్టు 27 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు 136 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 363 మి.మీ. న‌మోదైంది. ఇంత భారీ వర్షపాతం చాలా అరుదుగా సంభవించే ఘటనగా అధికారులు పేర్కొన్నారు.

తీవ్ర‌ ప్రభావం:
మంజీరా నది ఉప్పొంగడంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. రోడ్లు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్ష్మాపూర్ వద్ద కల్వర్ట్ కూలిపోవడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. వేలాది ఎకరాల పంటలు నీట మునిగి నాశనమయ్యాయి. రైల్వే ట్రాక్‌లు కూడా కొట్టుకుపోవడంతో రైలు సర్వీసులు రద్దయ్యాయి. కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీ మొత్తం నీట మునిగిపోయింది.

రక్షణ చర్యలు:
అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ అధికారులు, పోలీసులు కలసి అత్యవసర సహాయ చర్యలు చేపట్టారు. వందల కుటుంబాలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. అయితే ప్రజల ఆస్తులు, వాహనాలు పెద్దఎత్తున వరదలో కొట్టుకుపోయాయి. చెరువుల్లోకి, వాగుల్లోకి వందల కార్లు కొట్టుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంకా మరో 24 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనితో ప్రభుత్వం అత్యవసర విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచింది. గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచించారు. పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -