యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఘోరం
చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు బయటపడ్డారు. ఈ దారుణ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ ఎల్బీనగర్ కు చెందిన హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్, మరొకరు శనివారం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి బయలుదేరారు. ఉదయం 4.30 గంటల సమయంలో భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ వద్ద కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ఊపిరాడక చనిపోయారు. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు.