Wednesday, November 12, 2025

చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి

Must Read

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఘోరం

చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు బయటపడ్డారు. ఈ దారుణ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ ఎల్బీనగర్ కు చెందిన హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్, మరొకరు శనివారం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి బయలుదేరారు. ఉదయం 4.30 గంటల సమయంలో భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ వద్ద కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ఊపిరాడక చనిపోయారు. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు.

- Advertisement -
- Advertisement -
Latest News

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు న‌మోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో కౌశిక్ రెడ్డి యూసుఫ్‌గూడ వద్ద ఫంక్షన్ హాల్‌లోకి అనుచరులతో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -