Saturday, January 25, 2025

అల్లు అర్జున్ పై కేసు నమోదు!

Must Read

సినీ నటుడు అల్లు అర్జున్ పై చిక్కడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం పుష్ఫ–2 విడుదల సందర్భంగా అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు వచ్చారు. ఈక్రమంలో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. సదరు మహిళ మూసారంబాగ్ కు చెందిన రేవతిగా గుర్తించారు. ప్రస్తుతం కొడుకు పరిస్థితి సీరియస్ గా ఉంది. ఈ ఘటనపై పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. ఏ1గా సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు పెట్టారు. అల్లు అర్జున్ వస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఏ2గా అల్లు అర్జున్ ను చేర్చారు. ఏ3గా సెక్యూరిటీ మేనేజర్ ను చేర్చారు.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -