Tuesday, July 1, 2025

ఏపీలో బాలిక‌పై అత్యాచారం

Must Read

ఏపీలో బాలికపై ఓ యువ‌కుడు అత్యాచారం చేసిన ఘ‌ట‌న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. విజయనగరం పట్టణానికి చెందిన బాలిక భీమిలిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ పదో తరగతి వరకు చదువుకుంది. ఈ క్రమంలో బాలికకు హేమలత అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె చేపల తిమ్మాపురంలో రాడ్ బెండింగ్ పనులు చేస్తున్న నూకరాజుకు బాలిక‌ను పరిచయం చేసింది. నూక‌రాజు ఉపాధి చూపిస్తానని నమ్మబలికి బాలిక‌ను ఇంటికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరున జరిగిన ఈ ఘటనపై శనివారం భీమిలి పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు తరలించి నూకరాజు, అతడికి సహకరించిన హైమావతిపై పోక్సో నమోదు చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -