అక్కినేని నట వారసుడు అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. నేడు తెల్లవారుజామున 3 గంటలకు తన ప్రియురాలు జైనబ్ను వివాహం చేసుకున్నాడు. జూబ్లీహిల్స్లోని నాగార్జున నివాసంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. తెలుపు వస్త్రాల్లో అఖిల్,జైనబ్ దంపతులు ఆకట్టుకున్నారు. జూన్ 8 ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో రిసెప్షన్ వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.