Tuesday, June 3, 2025

గడ్డి మందు ఎంత పనిజేసే..!!

Must Read

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యాలయంలో గడ్డి మందు కొట్టించడంతో 51 విద్యార్థినులు అనారోగ్యం పాలయ్యారు. తీవ్రమైన దగ్గుతో పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో 8 మందిని కరీంనగర్ కు తరలించారు. కాగా, పాఠశాల ఆవరణలో గడ్డిని తొలగించేందుకు మందును పిచికారి చేశారని.. అదే గడ్డిని విద్యార్థినులతో తీయించారని, అందుకే వారంతా అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సొంత నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుందోనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్ శుభాకాంక్ష‌లు

తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు....
- Advertisement -

More Articles Like This

- Advertisement -