Tuesday, April 28, 2026

చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు మంచు మనోజ్.. తీవ్ర అస్వస్థత

Must Read

సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మనోజ్ మధ్య వివాదాలు మరోసారి రచ్చకెక్కాయి. తమ అనుమతి లేకుండా విద్యాసంస్థల్లోని డైరీఫాంలోకి మనోజ్ చొరబడ్డాడని మోహన్ బాబు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈరోజు పోలీస్ స్టేషన్‌కు మంచు మనోజ్ వెళ్లారు. మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉన్న తన తాతయ్య, నాన్నమ్మ సమాధులను దర్శించుకోవడానికి వెళ్తే మోహన్ బాబు, విష్ణు తమ అనుచరులతో దాడి చేయించారని ఫిర్యాదు చేశారు. అనంతరం మంచు మనోజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫిర్యాదు అనంతరం బయటకు వచ్చాక మాట్లాడుతుండగా తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డారు. దీంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -