పహల్గామ్లో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్లో పాక్లోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో దాదాపు వందమంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఆపరేషన్ సిందూర్పై, భారత సైనికులపై దేవ వ్యాప్తంగా ప్రజలతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కురిపించారు. సోషల్ మీడియా వేదికగా ఆపరేషన్ సిందూర్ తో పాటు, భారత పతాకాన్ని పోస్ట్ చేస్తూ తమ సందేశం వ్యక్తం చేస్తున్నారు. కానీ బాలీవుడ్ బడా స్టార్స్ పలువురు దీనిపై స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ లిస్టులో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి వారున్నారు. వీరంతా తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. వీరిపై ప్రస్తుతం నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.