ఇంగ్లండ్తో జరిగిన తొలి రెండు టీ20ల్లో భారత ఓపెనర్ సంజు శాంసన్ (26, 5) పరుగులకే ఔటయ్యాడు. ఈ రెండు మ్యాచ్ల్లోనూ ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్కే వికెట్ ఇచ్చాడు. రాజ్కోట్ వేదికగా నేడు (బుధవారం) సాయంత్రం జరిగే మూడో టీ20లో షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనేందుకు సంజు తీవ్ర సాధన చేశాడు. త్రోడౌన్ స్పెషలిస్టుల సాయంతో సిమెంట్ పిచ్పై కోచ్ సితాన్షు కోటక్తో కలిసి దాదాపు 45 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేశాడు.