పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ సైన్యంపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై వైసీపీ అధినేత వైయస్ జగన్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్ర దాడి ఘటనకు భారత సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసలు కురిపించారు. పహల్గామ్లో ఉగ్రదాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్ సింధూర్ ప్రారంభించాయని, మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని, దేశ ప్రజలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తామని చెబుతూ.. జైహింద్ అని పోస్టు చేశారు.