మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని వైసీపీ అధినేత వైయస్ జగన్ నివాళి అర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని పేర్కొన్నారు. అడవి బిడ్డల హక్కుల కోసం, దేశ స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శమని తెలిపారు. నేడు అల్లూరి సీతారామరాజుగారి వర్ధంతి సందర్భంగా నివాళుళులు అర్పిస్తున్నట్లు పోస్టులో రాసుకొచ్చారు.