కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని జైలులో అస్వస్థకు గురయ్యారు. ఆయన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నేడు ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆసుప్రతికి తీసుకెళ్లారు. ఆసుపత్రి వైద్యులు వంశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వంశీ భార్య పంజశ్రీకి ఆస్పత్రికి చేరుకున్నారు. కాగా, ఆమెను పోలీసులు గేటు వద్ద అడ్డుకున్నారు. వల్లభనేని వంశీ శ్వాసకోశ సమస్యతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. వైద్య పరీక్షల అనంతరం తిరిగి వంశీని జైలుకు తరలించనున్నారు.