Sunday, May 24, 2026

పాక్‌-భార‌త్ గొడ‌వ‌లు ఆపండి – ట్రంప్

Must Read

భారత్, పాకిస్తాన్ దాడులపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి స్పందించారు. రెండు దేశాలు టిట్ ఫర్ టాట్‌ లాగా చేస్తున్నార‌ని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించుకొని ఇంతటితో దీన్ని ఆపేస్తారని ఆశిస్తున్నాన‌ని చెప్పారు. రెండు దేశాలతో త‌న‌కు మంచి సత్సంబంధాలు ఉన్నాయ‌ని, ఈ గొడవలు ఆపుతారంటే త‌న‌కు చేతనైన సాయం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. కాగా, పాక్ ఉగ్ర స్థావ‌రాల‌పై భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్ పైనా ట్రంప్ స్పందించారు. రెండు శక్తివంతమైన దేశాలు రోడ్లపైకి వచ్చి ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోర‌ని, ప్రపంచానికి శాంతి కావాల‌ని, ఘర్షణలు వద్దని ట్రంప్ సూచించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -